సింధులో పారేది నీళ్లు కాదు.. వారి రక్తం.. కామెడీ ఆపు పాక్ బ్రో.!
Sat Apr 26, 2025 11:14 India
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ లో దాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ కు చుక్క నీరు కూడా వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఈమేరకు ఓ లేఖ రాసింది. ఈ పరిణామంతో పాకిస్థాన్ లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జీవాధారంగా ఉన్న సింధు నదిలో నీటిని ఆపేస్తే పాకిస్థాన్ ఎడారిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి నేతలు ఆగ్రహంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా స్పందించారు. సింధు నది ఒడ్డున ఉన్న సుక్కూర్లో మాట్లాడుతూ, "సింధు నది పాకిస్థాన్దేనని గతంలో భారత్ అంగీకరించింది. ఇప్పుడు ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారు. సింధు నది మాది, మాకే సొంతం. ఈ నదిలో నీరు ప్రవహిస్తుంది, లేదంటే వారి (భారతీయుల) రక్తమైనా ప్రవహిస్తుంది" అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. బిలావల్ భుట్టో పలు వ్యాఖ్యలతోగతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు, దాని పట్ల ఎటువంటి దయ చూపబోమని ఇక్కడ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!
పహల్గాం దాడిలో ఎక్కువ మంది పర్యాటకులు సహా 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఈ దాడికి బాధ్యత వహించింది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న కారణంతో భారత్, సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందాన్ని సదుద్దేశంతో అమలు చేయలేమని పేర్కొంటూ పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖకు అధికారికంగా నోటీసు పంపింది. ఒప్పందంలోని ఆర్టికల్ XII(3)ను ప్రస్తావిస్తూ, మారుతున్న జనాభా, ఇంధన అవసరాలు, ఉగ్రవాద ప్రోత్సాహాన్ని కారణంగా చూపింది. మరోవైపు, ఈ పరిణామం పాకిస్తాన్లో అంతర్గత కలహాలకు దారితీసింది. పంజాబ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం, సైన్యం సంయుక్తంగా చేపట్టిన చోలిస్థాన్ కాల్వల ప్రాజెక్టును పీపీపీ, సింధ్ ప్రావిన్స్ల నుంచి వచ్చిన వ్యతిరేకతతో నిలిపివేయాల్సి వచ్చింది. పరస్పర అంగీకారంతో కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్స్ (సీసీఐ)లో నిర్ణయం తీసుకునే వరకు కొత్త కాల్వలు నిర్మించబోమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టోతో భేటీ అనంతరం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!
దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!
టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!
సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!
మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..
సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..
మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!
వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.